అవసరమైతే ప్రధాని మోడీ, అమిత్‌షాను కలుస్తా : పవన్‌ కళ్యాణ్

Update: 2019-08-30 10:12 GMT

రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ హెచ్చరించారు. రాజధాని విషయంలో అవసరమైతే ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్‌ షాలను కలుస్తామని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితులను అర్ధం చేసుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని పవన్‌ అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి న రైతులతో మాట్లాడుతూ ఆయన ముందుకు సాగుతున్నారు. రెండు రోజలపాటు జనసేనాని రాజధానిలో పర్యటిస్తారు. 

Tags:    

Similar News