Kakinada: మత్య్సకారుల సమస్యల పై జనసేన ఉద్యమం

Kakinada: సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు యాత్ర, సముద్ర తీరం వెంబడి మత్స్యకారుల అభ్యుదయ యాత్ర.

Update: 2022-02-19 07:41 GMT

Kakinada: మత్య్సకారుల సమస్యల పై జనసేన ఉద్యమం

Kakinada:  మత్య్సకారుల సమస్యల పై జనసేన ఉద్యమానికి సిద్ధమైంది. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మత్స్యకార అభ్యుదయ యాత్రకు శ్రీకారం చుట్టింది. తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి యాత్ర సాగుతుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సూర్యారావుపేటలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ యాత్రను ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం దగ్గర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రలో పాల్గొని ప్రసంగిస్తారు. గంగపుత్రుల సమస్యలను పరిష్కరించడంలో జగన్ సర్కార్ విఫలమయ్యిందన్నారు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్.

Tags:    

Similar News