తూర్పు గోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ వ్యవహారం సస్పెన్స్ కు తెర పడింది. రాజోలు పోలీస్ స్టేషన్ లో రాపాక వరప్రసాద్ అనుచరులతో కలిసి లొంగిపోయారు. మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ రాపాకతో పాటు ఆయన అనుచరలుపై పోలీసులు కేసు నమోదు చేశారు.