ప్రతిపక్షాలను ఎదుర్కొనలేకే హడవుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు : నాదెండ్ల మనోహర్
ప్రతిపక్షాలను ఎదుర్కొనలేక వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హడవుడిగా స్థానిక సంస్థల ఎన్నికలను తీసుకొస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాకినాడలో జనసైనికులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కోసం 10వ తరగతి పరీక్షలు వాయిదా వేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం ఏంటని అని విమర్శించారు.