AP High Court: ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్‌ దాఖలు

AP High Court: ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు

Update: 2021-04-03 05:49 GMT

జన సేన (ఫైల్ ఫోటో)

 AP High Court: ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్‌ దాఖలు చేసింది. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరారు. రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కనీసం తమ అభిప్రాయం కూడా తీసుకోలేదని పేర్కొంది. హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను స్వీకరించనుంది. ఇప్పటికే బీజేపీ కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. మధ్యాహ్నం 2.15కి విచారించనుంది.

Tags:    

Similar News