Jana Sena: మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Jana Sena: జాతీయ పతాకాన్ని ఎగురవేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ * జనసేన పుట్టుకకు ఎంతో మంది స్పూర్తినిచ్చారు: పవన్ కళ్యాణ్

Update: 2021-08-15 06:45 GMT

మంగళగిరిలో జనసేన పార్టీ కారాలయంలో జెండా ఆవిష్కరణ చేసిన పవన్ కళ్యాణ్ (ఫోటో హన్స్ ఇండియా)

Jana Sena: అమరావతి మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎగురవేశారు. జనసేన పుట్టుకకు ఎంతో మంది స్పూర్తిగా నిలిచారని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వమని తుఫాన్ బాధితులు అడిగారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి చోట జనసేన జెండా రెపరెపలాడుతోందన్నారు. ప్రజల డబ్బులతో ఇచ్చే పథకాలకు సొంతపేర్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు లాంటి వాళ్ల పేర్లు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు.. జనసేనకు అధికారం వచ్చాక పథకాలకు జాతీయ నేతల పేర్లు పెడతామన్నారు. 

Tags:    

Similar News