మంత్రుల జాబితాను గవర్నర్‌కు అందించిన సీఎం

Update: 2019-06-07 11:23 GMT

గవర్నర్ నరసింహన్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేపు ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను ఆయనకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సచివాలయం ఆవరణలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కాసేపట్లో మంత్రుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.

Tags:    

Similar News