Jagan: ఇవాళ సీఎం జగన్ బస్సుయాత్రకు విరామం
Jagan: పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్న సీఎం జగన్
Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ బస్సుయాత్రకు విరామం ప్రకటించారు. ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. నెల్లూరు జిల్లాలో నేతలతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. ముఖ్య నేతలతో... నెల్లూరు జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలకు క్యాంప్ సైట్ వద్దకు రావాలని ఇప్పటికే పిలుపు వెళ్లింది. సీఎం జగన్ బస్సుయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పర్యటించి నెల్లూరు జిల్లాకు చేరుకుంది. నెల్లూరు జిల్లాలో బస చేసిన ప్రాంతంలో సీఎం జగన్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రేపటి నుండి బస్సుయాత్ర కోస్తాంధ్రలోకి అడుగుపెట్టనుంది.