Visakhapatnam: విశాఖలో కంటైనర్ కార్యాలయాల్లో ఐటీ రైడ్స్
Visakhapatnam: షీలానగర్లోని 2 కంటైనర్ కంపెనీల్లో రెండు రోజులుగా సోదాలు
Visakhapatnam: విశాఖలో కంటైనర్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. షీలానగర్లోని 2 కంటైనర్ కంపెనీల్లో రెండు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. తప్పుడు బిల్లులతో కంటైనర్లకు సంబంధించిన.. కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. షీలానగర్లోని గేట్వే డిస్ట్రి పార్క్స్ లిమిటెడ్, స్నో మాన్ లాజిస్టిక్స్లలో మూడోరోజు తనిఖీలు చేస్తున్నారు. గేట్ వే కు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో ఐటి దాడులు జరుగుతున్నాయి. లావాదేవీల్లో అక్రమాల ఫిర్యాదుతో దాడులు చేస్తున్నామంటున్నారు ఐటి అధికారులు.