Dharmana Prasada Rao: గతంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి జరిగింది
Dharmana Prasada Rao: సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి
Dharmana Prasada Rao: ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రజలు తప్పు చేసి ఎవరినో నిందించడం సరికాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలో కొత్తపేటలో సిసి రోడ్డు, మున్సిపల్ పిల్లల పార్కును ఆయన ప్రారంభించారు. ప్రతిపక్షాలు అభివృద్ది జరగలేదంటున్నాయి ఎప్పడూ జరగనంత అభివృద్ది ఈ మూడున్నరేళ్లలో జరిగిందన్నారు. ఎటువంటి అవినీతి లేకుండా డైరెక్టుగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు.