Ananthapur: పామిడి మండలంలో లారీ బోల్తా

Ananthapur: ఐస్‌ క్రీమ్ లోడుతో వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి బోల్తా * రూ.10లక్షల ఆస్తి నష్టం

Update: 2021-04-10 07:05 GMT

Representational Image

Ananthapur: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు సమీపంలో ఉన్న 44వ జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ప్రతిరోజు ఈ బ్రిడ్జిపై నిత్య నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం ఐస్ క్రీమ్ లోడుతో వెళ్తున్న భారీ లారీ కంటైనర్ అదుపు తప్పి బ్రిడ్జిని ఢీ కొట్టి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఐస్‌క్రీమ్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాదాపు పది లక్షల నష్టం జరిగింది. విష‍యం తెలుసుకున్న స్థానికులు ఐస్‌ క్రీమ్‌లను ఎత్తుకెళ్లారు..

Tags:    

Similar News