సీబీఐ మాజీ జేడీ, జనసేన పార్టీ నేత జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా మాజీ జేడీ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వినవచ్చాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చేశారు. ఈ వార్తలు తనను షాక్కు, ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. కొందరు కావాలనే ఇలాంటి వార్తలు వ్యాపింపజేస్తున్నారని ఆయన మండిపడ్డారు. "నేను జనసేనతోనే నడుస్తాను. నా అవసరం పార్టీకి ఉంటుందని అధ్యక్షుడు భావించే వరకు జనసేనలోనే ఉంటాను. పుకార్లను పుట్టించడం మాని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించడం, మొక్కలు నాటడం, యువతను చైతన్యపరచడం లాంటి కార్యక్రమాలపై దృష్టి పెడితే మంచిది.. జైహింద్" అని లక్ష్మీ నారాయణ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు.
I am surprised & shocked about Rumours being floated since morning about me.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) August 10, 2019
There is a saying -
"Rumors are carried by Haters, Spread by Fools, and accepted by Idiots"
Decide to which category you belong.
I will be with Janasena till the President feels that I'm useful to the party.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) August 10, 2019
Please don't waste time on such rumours and rather use it for helping the flood affected, planting saplings, clearing areas of plastic, motivating youth and many more.
Jai Hind.
- VV Lakshmi Narayana