ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర భద్రతను మరింత పెంచారు. రేషన్ డీలర్లు ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు తాడేపల్లిలో సెక్షన్ 30ని అమల్లోకి తెచ్చారు. అలాగే తాడేపల్లిలో ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించారు. ఇక సీఎం స్పందన ఆర్జీల నమోదు కోసం తాడేపల్లిలో 2 ఎకరాల స్థలం కేటాయించారు. ప్రజాదర్బార్కు వచ్చేవారి కోసం ఇక్కడ ఏర్పాట్లు చేయనున్నారు.