వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ.. దర్శనానికి నాలుగు గంటల సమయం

Vemulawada: భక్తుల రద్దీతో నిండిపోయిన క్యూ లైన్లు

Update: 2023-12-11 04:15 GMT

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ.. దర్శనానికి నాలుగు గంటల సమయం 

Vemulawada: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక చివరి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుండి భక్తులు ధర్మ గుండంలో పుణ్యస్థానాలు ఆచరించి,స్వామి వారికి ప్రీతి పాత్రమైన కోడె మొక్కు చెల్లిస్తున్నారు. భక్తుల రద్దీతో క్యూ లైన్లు నిండిపోయాయి. దీంతో స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News