ఎన్నికల వాయిదాపై సుప్రీం తీర్పును వైసీపీ వక్రీకరిస్తుంది : చంద్రబాబు

Update: 2020-03-18 14:02 GMT
chandrababu

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు తీర్పును వైసీపీ నేతలు వక్రీకరించడాన్ని టీడీపీ అదినేత చంద్రబాబు తప్పు బట్టారు. ఎన్నికల వాయిదాపై ఎందుకు సుప్రీంకోర్టు వెళ్లారని ప్రశ్నించారు. సుప్రీం తీర్పును వక్రీకరించడానికి బుద్ధి జ్ఞానం ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఎదురు దాడి చేస్తున్నారన్నారు. కరోనా వైరస్ పై ప్రభుత్వానికి అసలు బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. విదేశాల నుంచి రాష్ర్టానికి ఎంత మంది వచ్చారు ప్రభుత్వం ఎక్కడైనా క్వారంటైన్ ఏర్పాటు చేసిందా అని నిలదీశారు.  

Tags:    

Similar News