అనంతపురం తాడిపత్రిలో కొనసాగుతున్న హై టెన్షన్

* నిన్న తాడిపత్రిని సందర్శించిన ఎస్పీ సత్యఏసుబాబు * కేసుల విచారణను వేగవంతం చేశామన్న ఎస్పీ * ఇవాళ నిందితుల అరెస్ట్‌కు రంగం సిద్ధం

Update: 2020-12-30 05:17 GMT

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ సాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి అట్టుడుకుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు. అయితే. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిన్న తాడిపత్రిని ఎస్పీ సత్య ఏసుబాబు సందర్శించారు. కేసుల విచారణను వేగవంతం చేశామని ఎస్పీ తెలిపారు.. ఇవాళ నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రెండు వర్గాల నుంచి పలువురిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 


Full View


Tags:    

Similar News