చంద్రబాబు ఇంటివద్ద హైటెన్షన్... కొట్టుకున్న వైసీపీ-టీడీపీ కార్యకర్తలు...

Update: 2019-08-16 10:02 GMT

మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసం హైటెన్షన్ నెలకొంది .. అయన నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడంపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగిన సంగతి విదితమే.. అయితే దీనిపైన స్పందించిన చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైన డ్రోన్ చక్కర్లు తిప్పడం ఏంటని ప్రశ్నించారు . అయితే అది కేవలం వరద నీటి పరిస్థితి అంచనా కోసమే అలా చేయాల్సి వచ్చిందని ఏపీ జలవనరుల శాఖ ప్రకటించింది. ఈ నేపధ్యంలో చంద్రబాబు నివాసం వద్దకి టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చారు. దీనితో అక్కడికి వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు . దీనితో టీడీపీ-వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం కూడా కొంచం ఎక్కువ కావడంతో ఇరువర్గాలు మధ్య ఘర్షణ నెలకొంది . 

Tags:    

Similar News