కొడాలి నాని పిటిషన్‌పై విచారణ వాయిదా

* ఎస్‌ఈసీ ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్‌ వేసిన కొడాలి నాని * సోమవారం ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు

Update: 2021-02-16 05:06 GMT

ఫైల్ ఇమేజ్

ఎస్‌ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ కొడాలి నాని వేసిన పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సోమవారం ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కొడాలి నాని వీడియో పుటేజీని పరిశీలించింది. సరైన వీడియో ఫుటేజ్ సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. దీంతో పాటు ఇరు పక్షాల వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు సీనియర్ కౌన్సిల్ రఘురామ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది.

Tags:    

Similar News