AP High Court: ఐదుగురు ఐఏఎస్‌లకు జైలుశిక్ష, జరిమానా విధించిన హైకోర్టు

* మహిళ సాయిబ్రహ్మకు నష్టపరిహారం చెల్లించకపోవడంలై సీరియస్‌ * ఏఎండీ ఇంతియాజ్‌కు రెండు వారాల జైలుశిక్ష

Update: 2021-09-02 11:17 GMT

ఏపీ హైకోర్టు(ఫైల్ ఫోటో)

AP High Court: ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు హైకోర్టు జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది. జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు నెల రోజులు శిక్ష సస్పెండ్‌ చేసింది హైకోర్టు. నెల్లూరు జిల్లా తాళ్ళపాకకు చెందిన మహిళకు నష్టపరిహారం చెల్లించకపోవడంపై సీరియస్‌ అయ్యింది. ఏఎండీ ఇంతియాజ్‌కు రెండు వారాల జైలుశిక్ష, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌కు నెల రోజుల జైలుశిక్ష, ముత్యాలరాజుకు రెండువారాల జైలు శిక్ష విధించింది ఏపీ హైకోర్టు. మాజీ ఐఏఎస్‌ మన్మోహన్‌సింగ్‌కు నెల రోజుల జైలు శిక్ష విధించిన హైకోర్టు అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ శేషగిరిరావుకు రెండు వారాల జైలు శిక్ష విధించింది.

Tags:    

Similar News