మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు హైకోర్టు అనుమతి

* పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై మాట్లాడకూడదని కోర్టు సూచన * ఎస్‌ఈసీ, కమిషనర్‌ లక్ష్యంగా కామెంట్లు చేయొద్దన్న హైకోర్టు * మీడియాతో మాట్లాడొద్దని సింగిల్‌ జడ్జి ఆదేశాలపై..

Update: 2021-02-10 07:30 GMT

ఫైల్ ఇమేజ్ 

ఏపీ హైకోర్టు తీర్పుతో మంత్రి పెద్దిరెడ్డికి ఊరట లభించింది. మీడియాతో మాట్లాడొద్దని సింగిల్‌ జడ్జి ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు మంత్రి పెద్దిరెడ్డి. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడేందుకు అనుమతినిచ్చింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై మాట్లాడకూడదని కోర్టు సూచించింది. అలాగే ఎస్‌ఈసీ, కమిషనర్‌ లక్ష్యంగా కామెంట్లు చేయొద్దన్న హైకోర్టు ఆదేశించింది. 

Tags:    

Similar News