గతఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రదాడులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం హై అలర్ట్ ప్రకటించింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. దాంతో ప్రఖ్యాత హిందూ క్షేత్రమైన తిరుమలతోపాటు అర్బన్ జిల్లాలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేయాలని సిబ్బందికి ఎస్పీ అన్బురాజన్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. యాత్రికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులుగాని, వస్తువులుగాని కనిపిస్తే డయల్ 100కు, పోలీస్ వాట్సప్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు జనసమ్మర్థం ఉండే ప్రదేశాల్లో తనిఖీలు జరుపుతున్నామన్నారు.