నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా కొన్ని నెలల క్రితం ఏపీఐఐసీ ఛైర్మన్గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా ఆమెకు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్గా అందించాల్సిన జీతభత్యాలకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. ఏపీఐఐసీ ఛైర్మన్గా రోజాకు రూ.3.82 లక్షల జీతభత్యాలు అందివ్వనున్నారు. చైర్ పర్సన్ హోదాలో ఉన్న రోజాకు నెలక రూ. 3.82 లక్షలు ప్రతినెల ఇవ్వనున్నారు. ఇందులో రూ.2 లక్షలు జీతంగా నిర్ణయించింది. వాహన సౌకర్యానికి నెలకు రూ.60 వేలు, అధికారిక క్వార్టర్స్లో నివాసం లేని పక్షంలో వసతి సౌకర్యానికి నెలకు రూ.50 వేలు, మొబైల్ ఫోన్ ఛార్జీలకు నెలకు రూ.2 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకు నెలకు రూ.70 వేలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.