పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ వర్షం
West Godavari: సభకు ఏర్పాటు చేసిన షెడ్డులోకి వర్షం నీరు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ వర్షం
West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ వర్షం కురిసింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ సోమవారం భీమవరం రానున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. వర్షం ప్రభావంతో కటౌట్లు పక్కకు ఒరిగాయి. బహిరంగ సభకు ఏర్పాటు చేసిన షెడ్డులోకి వర్షం నీరు చేరింది. సభా ప్రాంగణమంతా బురదమయంగా మారిపోయింది.