ఏపీకి ఐఎండీ సూచనలు.. రాగల ఐదు గంటల్లో..

Update: 2020-10-20 03:58 GMT

ఏపీకి ఐఎండీ పలు సూచనలు చేసింది. రాగల నాలుగు, ఐదు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది. అటు విశాఖ, కృష్ణా, గుంటూరుతోపాటు చిత్తూరులో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న ఐఎండీ శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురంలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక ఐఎండీ సూచనలతో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలంది ఏపీ ప్రభుత్వం.

Tags:    

Similar News