సుప్రీంకోర్టులో మిషన్‌ బిల్డ్‌ ఏపీపై విచారణ

* ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు * జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే * విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని బెంచ్‌

Update: 2021-02-10 08:54 GMT

 సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఇమేజ్) 

సుప్రీంకోర్టులో మిషన్‌ బిల్డ్‌ ఏపీపై విచారణ జరిగింది. చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని బెంచ్‌. ఈ కేసులో విచారణ చేపట్టింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అయితే మిషన్‌ బిల్డ్ ఏపీ కేసులో జస్టిస్‌ రాకేష్‌ ఉత్తర్వులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టులో క్వావియేట్ దాఖలు చేశారు పిటిషనర్ సురేష్‌బాబు, పిటిషనర్‌ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌. 

Tags:    

Similar News