పెళ్ళైన నాలుగు రోజులకే ఓ వరుడు భార్యను విడిచిపెట్టి ఇంటినుండి పారిపోయాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. కోవెలకుంట్ల పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వీరాకుమార్ వివాహమైన నాలుగు రోజులకే నవ వధువును ఇంట్లో వదిలి పారిపోయాడు. దీంతో కాళ్ళ పారాణి ఆరకముందే నవ వధువు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి అతడిపై కేసు నమోదు చేసింది. వరుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడని, వేరే యువతితో ప్రేమ వ్యవహారం కారణంగానే పారిపోయినట్లు వధువు తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనకు ప్రేమ వ్యవహారమా? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి