టిక్ టాక్ వైరస్.. ప్రభుత్వ ఉద్యోగులను వదలడం లేదు. ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నా.. వాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్స్.. సద్గుణ, శైలజా టిక్ టాక్ వీడియోలు చేశారు. ఓ వైపు పరీక్షల కోసం రోగులు క్యూ కట్టిన సమయంలోనే.. టిక్ టాక్ వీడియోలు చేశారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో.. ఉన్నతాధికారులు.. ఇద్దరినీ విధుల నుంచి తొలగించారు. రక్త పరీక్ష కోసం వచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సూపరింటెండెంట్.. జిల్లా వైద్య అధికారుల ఆదేశంతో.. సద్గుణ, శైలజలను విధుల నుంచి తొలగించి మెమోలు అందజేశారు.