Andhra Pradesh: ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హాట్ కామెంట్స్
Andhra Pradesh: వెదవలు, సన్నాసులే గంజాయి వ్యాపారం చేస్తారు- సామినేని ఉదయభాను
Andhra Pradesh: సోషల్ మీడియాలో తన కుమారునిపై వస్తున్న వార్తను ఖండించారు ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. వెదవలు, సన్నాసులు గంజాయి వ్యాపారం చేస్తారని మండిపడ్డారు. తన కుమారుడు వెంకట కృష్ణ ప్రసాద్ వ్యాపారం చేస్తున్నారని, ప్రత్యర్థులు తనను ఎదుర్కొనలేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.