Andhra Pradesh: పిఠాపురం మండలం గోకివాడ హైస్కూల్‌లో కరోనా కలకలం

Andhra Pradesh: ముగ్గురు హైస్కూల్‌ ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ * పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు

Update: 2021-04-22 07:57 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడ హైస్కూల్‌లో కరోనా కలకలం రేపింది. హైస్కూల్‌లో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అయితే గత కొన్ని రోజులుగా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు జరుగుతున్నాయి. వారికి క్లాస్‌ చెప్పేందుకు ఉపాధ్యాయులు రెగ్యులర్ గా హాజరు అవుతున్నారు.. ఇప్పుడు ఉపాధ్యాయులు కరోనా రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురి అవుతున్నారు. దాంతో పంచాయతీ అధికారులు స్కూల్‌లో శానిటేషన్ చేస్తున్నారు.

Tags:    

Similar News