గోదావరి పరవళ్లు.. పోలవరం వద్ద బ్రేక్

Update: 2019-07-09 05:51 GMT

గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర తో పాటు ఎగువున కురుస్తున్న వర్షాలకు నది పోTeత్తుతోంది. ప్రస్తుతం 600 మీటర్ల వెడల్పున గోదావరి ప్రవహిస్తోంది. అయితే, పోలవరం వద్ద ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా కాపర్ డాం నిర్మించారు. ఇక్కడ గోదావరి వెడల్పు 2400 మీటర్లు కాగా, 2200 మీటర్ల వెడల్పున కాపర్ డాం ఏర్పాటు చేశారు. దీనితో 600 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తున్న గోదారి ఇక్కడకు వచ్చేటప్పటికి 200 మీటర్ల వెడల్పుకు కుచించుకుపోవాల్సి వస్తోంది. ఆ ఖాళీ లోనుంచే ఇక్కడ కిందకు ఉధృతంగా ప్రవహిస్తోంది గోదావరి. 

Tags:    

Similar News