నెల్లూరు జిల్లా స్పందన కార్యక్రమంలో కలకలం రేగింది. ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ 30మంది బుచ్చి గ్రామస్తులు అధికారులను ఆశ్రయించారు. తమ భూములు అమ్మలేదని పోలీసులు, రియల్టర్లు వేధిస్తున్నారంటూ జాయింట్ కలెక్టర్కు అర్జీ పెట్టుకున్న బాధితులు బలవన్మరణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, సమస్యను పరిశీలించి న్యాయం చేస్తామమని హామీ ఇచ్చిన జాయింట్ కలెక్టర్ ఎవరూ బలవన్మరణానికి పాల్పడవద్దని సూచించారు.