ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న గౌతమ్ సావాంగ్ను పూర్తిస్ధాయి డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ను బదిలీ చేసి ఆయన స్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్న గౌతం సవాంగ్ను ఇన్చార్జి డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న ఆయన తాజా ఉత్తర్వులతో పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగనున్నారు.