నెల్లూరు చేరుకున్న గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి

అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం జగన్, మంత్రులు

Update: 2022-02-23 01:27 GMT

నెల్లూరు చేరుకున్న గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి

Nellore: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జన్ రెడ్డి కాసేపటి క్రితం నెల్లూరు చేరుకున్నాడు. అమెరికా నుంచి నేరుగా వచ్చిన కృష్ణ అర్జన్ రెడ్డి చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరు నివాసానికి చేరుకున్నారు. తండ్రి గౌతమ్ రెడ్డి మృతితో అర్జన్ రెడ్డి కన్నీరుమున్నీరవుతున్నాడు. మరోవైపు మేకపాటి గౌతమ్ రెడ్డి కడసారి చూపు కోసం జిల్లాలోని అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో నెల్లూరు ఒక్కసారి శోకసంధ్రంలో మునిగిపోయింది.

Full View


Tags:    

Similar News