ప్రస్తుతం జరుగుతున్న ఏపీ శాసన సభ సమావేశంలో మరో నలుగురు టీడీపీ సభ్యుల పైన సస్పెన్షన్ పైన వేటు పడింది . ఏపీ మరియు తెలంగాణా ప్రభుత్వ ప్రాజెక్ట్ నిర్మాణాలపైన ... పరస్పర నీటి వినియోగంపైన చర్చ జరిగింది . దీనిపైన జగన్ సమాధానం ఇచ్చే సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళను దిగారు . నినాదాలు చేసారు . అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి చెప్పిన వారు వినిపించుకోలేదు . వారిపైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కోరారు .
దీనితో అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి నలుగురు టీడీపీ సభ్యుల మీద సస్పెన్షన్ తీర్మానం ప్రవేశ పెట్టారు . దీనితో స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేసారు . టీడీపీ సభ్యులు అశోక్, బాల వీరాంజనేయలు, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్ను శాసనసభ నుండి ఈ రోజు సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రెండు రోజుల క్రితం ముగ్గురు టీడీపీ ఉప నేతలు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే ..