కడప జిల్లా కమలాపురం సమీపంలోని పెన్నా నదిలో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృత దేహం లభ్యంకాగ మరో ముగ్గురి చిన్నారుల కోసం గాలిస్తున్నారు. పెన్నా నదిలో గల్లంతయిన వారిని షాహిద్, చాంద్ బాషా, జాఖీర్, జాఫర్ హుస్సేన్ ధర్గావీదికి చెందిన వారిగా గుర్తించారు.సరదాగా ఈత కోసమని వెళ్లి నీటిలొమునిగిపోయారని తెలుస్తోంది. చిన్నారుల కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.