YCP: వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్రెడ్డి
YCP: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ అధినేత సీఎం జగన్
YCP: వైసీపీ అధినేత సీఎం జగన్ ఆధ్వర్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరారు. తిరుపతి జిల్లా ఎద్దర చెరువు వద్ద విష్ణువర్థన్రెడ్డికి కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు వచ్చిన అన్నదమ్ములందరికి వైసీపీ తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నానని సీఎం జగన్ అన్నారు. 6వ తేదీన కావలిలో సిద్ధం సభ జరగనుందని...అప్పుడు వీలైనంత ఎక్కవ మంది పార్టీ శ్రేణులను కలుస్తానని సీఎం జగన్ హామీనిచ్చారు.