Kalava Srinivasulu: విద్యుత్ సంక్షోభానికి జగన్ అసమర్థ పాలనే కారణం

* రాష్ట్రాన్ని చిమ్మచీకట్లో నెట్టి వేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది : కాల్వ శ్రీనివాసులు

Update: 2021-10-14 02:12 GMT

కాల్వ శ్రీనివాసులు (ఫైల్ ఫోటో)

Kalava Srinivasulu: ఏపీలో విద్యుత్ సంక్షోభానికి సీఎం జగన్ అసమర్థ పాలనే కారణమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాష్ట్రాన్ని చిమ్మచీకట్లో నెట్టి వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థల యజమానులను బెదిరించడం దారుణమన్నారు. అసలు రాష్ట్రానికి పెట్టుబడిదారులు రావడానికి భయపడుతున్నారని అన్నారు. వేల కోట్ల బకాయిలతో బొగ్గు సరఫరా ఆగిపోయిందన్నారు. పరిపాలన చేతకాకపోతే జగన్‌మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవాలని సూచించారు.

Tags:    

Similar News