విశాఖ కొమ్మాది శ్రీ చైతన్య కళాశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 70మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. యాజమాన్యం విషయాన్ని గుట్టుగా ఉంచడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విద్యార్థినులు అస్వస్థతకు గురైనా సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు.