Andhra Pradesh: చిత్తూరు జిల్లా కుప్పంలో ఫ్లెక్సీ రగడ

Andhra Pradesh: లక్ష్మీపురం క్రాస్‌రోడ్ దగ్గర బ్యానర్ ఏర్పాటు చేసిన టీడీపీ * టీడీపీ బ్యానర్‌ను కాల్చేసిన దుండగులు

Update: 2021-03-25 05:16 GMT

కుప్పం (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: చిత్తూరు జిల్లా కుప్పంలో ఫ్లెక్సీ కాల్చేసిన ఘటన రచ్చ రేపుతోంది. లక్ష్మీపురం క్రాస్‌రోడ్ దగ్గర టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో టీడీపీ నేతలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు.. బ్యానర్ కాల్చిన వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.

Full View


Tags:    

Similar News