Heart Attack: గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థిని మృతి
GBS Disease: కొత్త వైరసులు, కొత్త జబ్బులు ఈ పేరు వింటేనే జనాలు హడలిపోతున్నారు. జీబిఎస్ వ్యాధి సోకిన కేసులు ఏపీలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా కమలమ్మ అనే ఓ 50ఏళ్ల మహిళ ఈ జబ్బుతో మరణించింది. దీంతో జనంలో మరింత భయం పెరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ రెండు రోజుల క్రితమే వ్యాధి లక్షణాలతో గుంటూరు జీజీహెచ్ లో చేరింది. చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు వైద్యులు చెప్పారు.
రాష్ట్రంలో ఈ కొత్త వ్యాధి సోకి చనిపోయిన తొలి మహిళ ఇమే కావడంతో వైద్యులు కూడా టెన్షన్ పడుతున్నారు. ప్రజలను అప్రమత్త చేయడంతోపాటు జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 17 మందిలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించగా..గుంటూరు జీజీహెచ్ లోనే ఏడుగురు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జీజీహెచ్ కు కమలమ్మను తీసుకువచ్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇది జీబీఎస్ గా నిర్థారించారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు మరెవరిలో లేవని తేల్చారు. ఓ పక్క కోళ్లలో వచ్చిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు మనుషుల్లోనూ గుర్తించారు. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడింది. వైద్యారోగ్యశాఖ అధికారులు ఈభయాందోళనలో ఉండగానే మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఏపీకి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఇటీవల ఇది తెలంగాణలోనూ ప్రవేశించింది. ఏపీలో ఏకంగా మొదటి మరణానికి కారణమైంది.