విత్తనం కోసం వచ్చి ప్రాణం వదిలాడు

Update: 2019-08-29 11:08 GMT

అనంతపురం జిల్లా ఉరవకొండ మార్కెట్ యార్డ్‌లో ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఈరోజు వేరు శనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఉరవకొండ మార్కెట్ యార్డులో రైతులు క్యూ కట్టారు ఈ క్రమంలో దాసరి సిద్దప్ప అనే వ్యక్తి క్యూ లైన్లో నిలబడి ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి రైతులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో రైతులు మార్కెట్ యార్డు వద్ద ఆందోళన చేపట్టారు.

Full View 

Tags:    

Similar News