వైఎస్‌ జగన్‌ పేరుతో తప్పుడు ట్వీట్‌

Update: 2019-04-25 01:54 GMT

ఇంటర్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర వివాదం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ యూ నిందించరాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేసినట్టుగా ఆయన పేరుతో తప్పుడు ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ అయింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం ఆ ట్వీట్ పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపింది. అది పూర్తిగా తప్పుడు ట్వీట్‌ అని, ఈ ట్వీట్‌ను దురుద్దేశంతో రూపొందించి, ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కాగా ప్రస్తుతం జగన్ కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఎల్లుండి ఆయన హైదరాబాద్ కు తిరిగిరానున్నారు. 

Similar News