కోరుట్లలో నకిలీ ఆధార్‌ కార్డుల కలకలం.. రూ. 30 వేలు తీసుకుని..

Update: 2020-02-08 10:16 GMT

జగిత్యాల జిల్లాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కోరుట్లలో నకిలీ ఆధార్‌కార్డులు ఇప్పించడం కలకలం రేపుతోంది. అమాయకుల దగ్గర 30 వేల రూపాయాలు తీసుకుని తప్పుడు ఆధార్‌కార్డులు ఇప్పించారు కేటుగాళ్లు. నక్కలగుట్టుకు చెందిన లలిత అనే మహిళ ఇద్దరు కుమారులు, కుమార్తెకు ముస్లిం పేర్లతో ఆధార్‌కార్డులు ఉన్నాయి. అయితే ఫిరోజ్‌, జియో అనే వ్యక్తులు ఆమెను హైదరాబాద్‌ తీసుకెళ్లి నకిలీ ఆధార్‌ కార్డులు ఇప్పించారు. తమకు సరైన ఆధార్‌కార్డులు ఇప్పించాలని తహసీల్దార్‌కు బాధితుల వినతి చేసింది.


Full View

 

Tags:    

Similar News