బిగ్ బ్రేకింగ్ : నేడు ముఖ్యమంత్రితో సమావేశం కానున్న నిపుణుల కమిటీ

Update: 2019-12-20 03:47 GMT

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ఏర్పాటు చేసిన జీఎన్ రావ్ నిపుణుల కమిటీ బృందం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనుంది. సాయంత్రం ఐదు గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జగన్ తో సమావేశం కానుంది ఈ కమిటీ. 45 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీరి బృందం పర్యటించింది. ఈ సందర్బంగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో రికార్డులు తెప్పించుకుంది. 15 రోజుల కిందటే ఈ కమిటీ ముఖ్యమంత్రితో భేటీ అయి మధ్యంతర నివేదిక సమర్పించింది. దాంతో సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News