Kothapalli Geetha: మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

Kothapalli Geetha: PNB బ్యాంకును మోసం చేసిన కేసులో ఐదేళ్లు జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు

Update: 2022-09-15 04:15 GMT

Kothapalli Geetha: మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

Kothapalli Geetha: మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. PNB బ్యాంకును మోసం చేసిన కేసులో ఐదేళ్లు జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావుకు జైలుశిక్ష విధించింది. ఈ కేసులో 8 మందిపై అభియోగాలు మోపి 2015లో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది CBI. అయితే నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో కొత్తపల్లి గీత పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు ఇచ్చిన శిక్షను నిలిపివేసి బెయిల్‌ మంజూరు చేయాలని కొత్తపల్లి గీత కోరింది. ఈ క్రమంలో రామకోటేశ్వరరావు దంపతులు, రాజ్‌కుమార్‌ పిటిషన్లను హైకోర్టు వేర్వేరుగా విచారించనుంది.

Tags:    

Similar News