కచ్చులూరు బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సుప్రీంను ఆశ్రయించారు. బోటు వెలికితీతపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న హర్షకుమార్ బోటు వెలికితీత విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ఆచూకీ లేని మృతదేహాలను వెంటనే వెలికి తీసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణలో కేంద్రం కూడా జోక్యం చేసుకునేలా ఆదేశాలివ్వాలని హర్షకుమార్ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.