మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. రాయదుర్గంలో ఉద్రిక్తత
*ఇంటి గోడ దూకి పాదయాత్రకు వెళ్లే ప్రయత్నం చేసిన కాల్వ శ్రీనివాసులు
మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. రాయదుర్గంలో ఉద్రిక్తత
Anantapur: అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నేతల అక్రమ ఇసుక రవాణాపై మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు పాదయాత్రకు సిద్ధమయ్యారు. అయితే.. పాదయాత్రకు అనుమతిలేదంటూ పోలీసులు కాల్వకు నోటీసులిచ్చారు. మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో.. ఇంటి గోడ దూకి పాదయాత్రకు వెళ్లే ప్రయత్నం చేసిన కాల్వ శ్రీనివాసులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు కాల్వ శ్రీనివాసులు.