ఏపీలో 108 సిబ్బంది సమ్మె విరమణ

Update: 2019-07-25 16:24 GMT

సీఎం జగన్‌తో 108 ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఉద్యోగుల సమ్మె విరమించారు. ఈ రాత్రి నుంచే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 31లోపు వేతన బకాయి చెల్లించేందుకు సీఎం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. గురువారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన సిబ్బంది తమ సమస్యలను వివరించారు. 108ను ప్రభుత్వమే నిర్వహించడమే సహా అన్ని సమస్యలను పరిష్కరించాల్సిందిగా సీఎంకు విన్నవించుకున్నారు. వారు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం.. ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక పాలసీ రూపొందించి త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  

Tags:    

Similar News