ఏపీలో శాసనమండలి స్థానానికి ఈసీ షెడ్యూల్‌

Update: 2020-06-15 09:44 GMT

డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఏడాది జూలై 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ నెల 18న దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువరించనుంది.

జులై 6న పోలింగ్‌ నిర్వహించనుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఇచ్చింది. 26న నామినేషన్లను పరిశీలన చేపట్టనున్నారు. 29 వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. జులై 6న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

Tags:    

Similar News