Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు
*స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న ఈవో దంపతులు
Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు
Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు స్కందమాత అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శేషవాహనాదీసులైన శ్రీస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న దంపతులు, ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.